ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎలా కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కుంటున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు అనగానే పర్టికులర్గా నాలుగు పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి . మరీ ముఖ్యంగా ప్రభాస్ - అల్లు అర్జున్ - తారక్- చరణ్ ల పేర్లు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి . అయితే ప్రభాస్ ఎటువంటి విధంగా కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కోడు. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు . ప్రభాస్ పై నెగిటివ్ ట్రోలింగ్ జరిగేది కూడా చాలా చాలా తక్కువ . ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది అంటే అది అల్లు అర్జున్ మీదనే చెప్పాలి .


పుష్ప2 సినిమా విషయంలో అల్లు అర్జున్ భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.  ఆయన ఒక రోజు జైలుకు వెళ్లి కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే . అయితే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవడం ఫ్యాన్స్ కి  హర్టింగా  అనిపించింది . మరి ముఖ్యంగా మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఏవో కొన్ని తగాదాలు ఉన్నాయి అన్న విషయం హైలైట్ గా మారింది . అంతేకాదు రాంచరణ్ , గేమ్ చేంజర్  సినిమాతో ఫ్లాప్ వేసుకున్నాడు .



ఆ టైంలో కూడా రాంచరణ్ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . అల్లు అర్జున్ పై నెగిటివ్ ట్రోలింగ్ చేసిన కారణంగానే ఇలా అల్లు ఫ్యాన్స్  రామ్ చరణ్ సినిమాపై నెగటివ్గా రివెంజ్ తీర్చుకున్నారు అంటూ మాట్లాడుకున్నారు జనాలు.  అంతేకాదు ఇక తారక్ గురించి అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు పొలిటికల్ పరంగా ఒక ఇష్యూ హైలెట్ అవుతూనే ఉంటుంది.  తారక్ ఎప్పుడు కూడా టిడిపికి సపోర్ట్ చేయడు అని .. అసలు టిడిపి తో సంబంధం లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు .



అసలు పొలిటికల్ పరంగానే తారక్ మాట్లాడడానికి ఇష్టం పడకపోయినా కావాలని ఆయన  పేరుని లాగుతూ ఉంటారు . ఇప్పుడు ఈ ముగ్గురిదీ.. ఒకే ప్రాబ్లం . అయితే దీని నుంచి వీళ్ళు బయటపడితే నెక్స్ట్ వీళ్ళ నుంచి వచ్చే సినిమాలకు ఎటువంటి నెగిటివ్ ట్రోలింగ్ ఉండకుండా ఉంటుంది.  ఒకవేళ ఇంకా కూడా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటే మాత్రం కచ్చితంగా వీళ్ళ సినిమాపై 80% పాజిటివ్ కామెంట్స్ వినిపించిన .. అట్లీస్ట్ 20% నెగిటివ్ గా మాట్లాడుకుంటూనే ఉంటారు జనాలు . ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటారో.. కాలమే దానికి ఆన్సర్ ఇవ్వాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: