![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-5345df0f-7ead-4cac-a720-70e6363ad067-415x250.jpg)
ప్రస్తుతం రష్మిక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ఛావా సినిమాలో నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేస్తున్నారు. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు రిలీజ్ అయ్యింది. రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది. కానీ విక్కీ కౌశల్ నటన ముందు వేరే వాళ్ల నటన అంతాగా హైలేట్ అవ్వలేదు. ఈ సినిమాకు విక్కీ కౌశల్ నటన, యాక్షన్ సీన్స్ మరింత బలాన్ని చేకూర్చాయి.
అయితే ఇటీవల రష్మిక ఓ ఇంటర్వ్యూలో నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'కేవలం నేషనల్ క్రష్ అని ట్యాగ్ ఉన్నంత మాత్రన సినిమా టికెట్లు అమ్ముడుపోవు. ట్యాగ్ అనేది కెరీర్ కి ఎప్పటికీ ఉపయోగపడవు. వీటన్నింటి కంటే కూడా ముఖ్యమైనది మరొకటి ఉంది.. అదే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఇప్పుడు నా జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.