మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా లో నటించింది భాగ్య శ్రీ బోర్స్. రవితేజ సినిమా తో పరిచయమైన హీరోయిన్స్ కి మంచి కేజ్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ప్రకారంగానే మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీకి వెంట వెంట ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ అమ్మడు ఇప్పటికే విజయ్ దేవరకొండతో కింగ్ డం సినిమాలో నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన కింగ్ డం టీజర్ చూస్తే భారీ సినిమాగానే అది రాబోతుందని అర్ధంవుతుంది.

ఇక నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ తో కాంత సినిమా ఛాన్స్ కూడా పట్టేసింది అమ్మడు. దుల్కర్ సల్మాన్ తో పాటుగా రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ లో తన గ్లామర్ షోతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన భాగ్య శ్రీ లేటెస్ట్ గా కాంత సినిమా ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. తనలో బాగా ప్లస్ అయిన కళ్ల తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ రెండు సినిమాలతో పాటు రాం తో సినిమా చేస్తుంది అమ్మడు. ఆ సినిమా కూడా లవ్ స్టోరీ గా రాబోతుందని తెలుస్తుంది. మొత్తానికి కాంత ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా ఈ కాంత చూస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లు ఫాం కొనసాగించేలా ఉంది. కాంత సినిమా ఫస్ట్ లుక్ ఆమె ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసింది. కింగ్ డం హిట్ పడింది అంటే మాత్రం కచ్చితంగా అమ్మడికి డబుల్ క్రేజ్ వచ్చినట్టే లెక్క. రాబోతున్న 3 సినిమాలు అమ్మడికి వెరీ లక్కీ అని చెప్పొచ్చు. సరైన రోల్ పడింది అంటే మాత్రం భాగ్య శ్రీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లినట్టే అని చెప్పొచ్చు. అమ్మడిలో ఆ క్వాలిటీస్ కనిపిస్తున్నాయని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: