సినీ నటి రష్మిక మందన్న అంటే తెలియని వారుండారు. ఈ బ్యూటీని ముద్దుగా నేషనల్ క్రష్ అని ట్యాగ్ కూడా ఇచ్చేశారు. రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో కలిసి నటించిన ఛావా సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే ఛావా సినిమా రిలీజ్ అనంతరం రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. 'నేనెప్పుడూ జీవితాన్ని సీరియస్ గా తీసుకొను. కెరీర్ పరంగా నన్ను దైవ శక్తి ముందుకి నడిపిస్తుంది. నేను ఏ సినిమాలో నటించాలని అనుకున్న ముందుగా కథనే చూస్తాను. నాకు కథ నచ్చితే చాలు ఇద్దరు పిల్లలకు తల్లిగా అయిన నేను నటిస్తాను. సినిమా కథలో ముఖ్య పాత్ర అనుకునే పాత్ర ఏదైనా నేను నటిస్తాను. ఆఖరికి అది అమ్మమ్మ పాత్ర అయిన సరే నాకు ఏం ఇబ్బంది లేదు. ఏ సినిమా చేసిన ఎంజాయ్ చేస్తూనే నటిస్తాను. కొన్ని సార్లు అనుకోకుండా ఒప్పుకున్న సినిమాలే ప్రేక్షకులకు నచ్చుతాయి' అంటూ రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.  
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేస్తున్నారు. రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది.
రష్మిక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: