తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత అయినటువంటి కృష్ణవేణి ఈ రోజున తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈమె వయసు 102 సంవత్సరాలు కాగా, గత కొన్నేళ్లుగా ఈమె వయోభార సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నదట.. స్వర్గీయ నందమూరి తారక రామారావును ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి లభిస్తుంది ఆమె నిర్మాతగా వ్యవహరించిన మన దేశం సినిమాలో ఎన్టీఆర్ చిన్న పాత్ర చేస్తూ అలా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నిర్మాత కానే కాకుండా నటిగా తెలుగు తమిళ్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకుంది కృష్ణవేణి.  కృష్ణవేణి నిర్మాత గానే కాకుండా సింగర్ గా కూడా  పేరు సంపాదించింది.


కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో పంగిడిలో జన్మించింది. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే  1936లో చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది కృష్ణవేణి. కృష్ణవేణి తండ్రి  ఒక వైద్యుడట. అలా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తున్న సమయంలోనే మీర్జాపురం రాజుతో పరిచయం ఏర్పడి,ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం జరిగింది. వివాహం అనంతరం బయట సంస్థలలో పనిచేయడం ఇష్టం లేక కృష్ణవేణి సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించింది.


జయ పిక్చర్స్-శోభన అనే స్టూడియో ని కూడా నిర్మించిందట కృష్ణవేణి.. మీర్జాపురం రాజా నిర్మించిన మొదటి సాంఘిక సినిమా జీవనజ్యోతి.. ఇందులో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో నారాయణరావు హీరోగా నటించారు.  ఆ తర్వాత పలు చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించింది కృష్ణవేణి.. అలా ఎంతోమంది సీనియర్ హీరోల చిత్రాలలో నటించిన కృష్ణవేణి ఇటీవలే వయోభారం సమస్యతో ఇబ్బంది పడుతూ కొన్ని గంటల క్రితం కన్నుమూసినట్లు ఆమె కూతురు అనురాధ తెలియజేసింది.  ఈ విషయం విన్న సినీ సెలబ్రిటీలే కాకుండా అభిమానులు కూడా ఈమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: