కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. యాంకర్ గా బుల్లితెరపై కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు .. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి స్టార్ స్టేటస్ను అందుకున్నాడు .. ఏక గత సంవత్సరం అమరాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు .. ఇక ఈ సినిమా విజయం సాధించి .. భారీ కలెక్షన్లు కూడా రాబట్టి రికార్డులు కూడా క్రియేట్ చేసింది .. ఇక రీసెంట్ గా ఫిబ్రవరి 14న తమిళనాడులో 100 డేస్ ఫంక్షన్ కూడా జరుపుకుంది .. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది ..


రాజకుమార్ పేరిస్వామి తెరకెక్కించారు .. అయితే ఎప్పుడు తాజాగా హీరో శివ కార్తికేయన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఒక సినిమాలోనే హీరోగా కాకుండా ఈ హీరో ఇప్పుడు తన నిజ జీవితంలో కూడా హీరోగా మారాడు. 2018 లో కేరళ వయనాడ్ లో భారీ వరదలు వచ్చాయి .. ఆ సమయంలో ఎంతోమంది ఆస్తులు ఇల్లు రకాలుగా నష్టపోయారు .. అయితే ఆ సమయంలో తనతో పాటు ఓ సినిమాలో నటించిన క్రికెటర్  నటి సజనా సంజీవన్ ‘కనా’ కు హీరో శివ కార్తికేయన్‌ ఎంతో సహాయం చేశారు .. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని క్రికెటర్ నటి సజనా సంజీవన్ ‘కనా’ ఓ ఈవెంట్లో చెప్పకు వచ్చారు ..


ఇక సజనా సంజీవన్ ‘కనా’ మాట్లాడుతూ 2018 లో వ‌య‌నాడ్‌ ప్రాంతం మొత్తం తీవ్ర వరదల్లో మునిగిపోయింది .. ఆస‌మయంలో హీరో శివ కార్తికేయన్‌ సార్ నాకు ఫోన్ చేసి ఏమైనా సాయం కావాలని అడిగారు .. నా క్రికెట్ సోమాగ్రి అంతా పోయిందని చెప్పాను .. కానీ నాకు కేవలం స్పీక్స్ షూస్ కావాలని అడిగాను .. ఇక అవి కేవ‌లం వారం రోజుల్లోనే షూస్ నాకు పంపించారు ‘ అంటూ చెప్పుకొచ్చింది సజన. ఇక దీంతో ఇప్పుడు శివ కార్తికేయన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్ ఎంత పెద్ద స్థాయికి వెళ్లిన .. హీరో శివకార్తికేయన్ ఇప్పటికీ సామాన్యుల గురించి ఆలోచిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు .. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరో పరాశక్తి , ఎస్కే 23 సినిమాలో నటిస్తున్నారు .. అయితే వీటిలో పరాశక్తి ఆగస్టు లేదా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: