నటరత్న ఎన్టీఆర్ తొలి సినిమాగా నిలిచిన మన దేశం సినిమా నిర్మించిన సీనియర్ నటి కృష్ణకుమారి ఫిబ్రవరి 16 అనగా ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు .. మనదేశంలో ఎన్టీఆర్‌కు అవకాశం లభించడం నటనకు గాను అందుకున్న పారితోషకం విడుదలయ్యాక సినిమా సాగిన వైనం అన్ని ఆసక్తిగా ఉంటాయి. ఇక మన దేశం సినిమాని తెరకెక్కించక ముందే దర్శకుడు యల్వీ ప్రసాద్ తనకు తగిన నటుల అన్వేషణ కోసం నాటకాలు చూస్తూ ఉండేవారు .. ఆ సమయంలోనే విజయవాడలో ఎన్టీఆర్ వేసిన నాటకం చూశారు . ఇక అప్పుడే ఎన్టీఆర్ లో ఓ గొప్ప న‌టుడు ఉన్నారని యల్వీ ప్రసాద్ గుర్తించారు .. అందుకే ఆయనను ప్రోత్సహించారు సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు .. కానీ రామారావు చదువు పూర్తవుగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఆ తర్వాత అక్కడ వాతావరణం నచ్చక రాజీనామా చేయటం అన్నీ చకచగా జరిగిపోయాయి..


ఇక అప్పుడు మద్రాస్ వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు .. అప్పటికే మన దేశం షూటింగ్ మొదలైంది .. ఇక ఈ సినిమాను మీర్జాపురం రాజా వారి సతీమణి నటి కృష్ణవేణి నిర్మించి హీరోయిన్గా నటించారు. ఇక మనదేశంలో ఎన్టీఆర్ నెగిటివ్ స్టేట్స్ ఉన్న పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టారు. అందుకుగాను ఆయనకు 250 రూపాయల పారితోషకం ఇచ్చారు. నటి కృష్ణవేణి ఏ ముహూర్తాన ఎన్టీఆర్ కి అంత ఇచ్చారో కానీ తర్వాత రోజుల్లో ఎవరు అందుకోలేని అగ్ర నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అందుకే కృష్ణవేణి ఇది లక్కీ హ్యాండ్ అని అప్పటి సినీ జనం అంటూ ఉంటారు .


అలాగే మన దేశం సినిమాకి గంటసాల సంగీతం అందించారు .. రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమా పాటలు కూడా ఎంతో బాగా హీట్ అయ్యాయి .. ఎందరో కొత్త నటులతో తెరకెక్కిన మన దేశం మూవీ 1949 నవంబర్ 24న రిలీజ్ అయింది .. అలాగే ఈ సినిమాకి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన విప్రదాస్ ఆధారం .. ఆ కథకు య‌ల్వీ ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయిగా .. సీనియర్ రచయిత సముద్రాల మాటలు పాటలు అందించారు. అలాంటి ఎన్టీఆర్ మొదటి సినిమా తర్వాత చిత్ర పరిశ్రమలో ఎవరు అందుకొని స్థానంలోకి వెళ్లి తర్వాత రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు అంత గొప్ప వ్యక్తికి తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: