సౌత్ స్టార్ హీరో సూర్య తెలుగు తో పాటు కోలీవుడ్ లో కూడా ఆయన అభిమానులు ఎప్పుడు మంచి సినిమా చేస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. ఇప్పుడు ఆ టైం వచ్చింది .. సార్ , లక్కీ భాస్కర్ లాంటి వైవిద్యమైన సినిమాలు తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి కి ఈ హీరో ఓకే చెప్పారు .. ఏ గెటప్పులు సందేశాలు ఏమీ లేకుండా చక్కటి ప్రేమ కథ ను చెప్పారు .. ఈ సినిమా వచ్చే మే నుంచి షూటింగ్ కు వెళ్లబోతుంది .. అయితే సూర్య ఇప్పుడు ఆర్జె బాలాజీతో చేస్తున్న 45వ సినిమా సగానికి పైగానే పూర్తయ్యింది. కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో వేసవిలో విడుదల కానుంది.


ఇక ఇప్పుడు వెంకి అట్లూరి సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ నిర్మించబోతున్నారు ..  వెట్రిమారన్ సూర్య‌తో చేసే  వాడివాసల్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఆలోగా వెంకీ అట్లూరి తన ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడట. ఈ కొలాబరేషన్ కారణంగానే సితార నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తమిళ వెర్షన్ కి సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చాడు . అంటే ఇది ముందు నుంచి ప్లాన్డ్ గా సెట్ చేసుకున్న కాంబోని అర్థమయ్యింది . అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే  ను తీసుకునే అవకాశం ఉంది ..


ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు కానీ ఈమె హీరోయిన్ అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది .. ఇప్పటికే విజయ్ దేవరకొండ , రామ్ లకు జంటగా సినిమాలు చేస్తుంది . ఇక ఈమె మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ భారీ డిజాస్టర్ అయింది .. అలాంటి భారీ ఫ్లాఫ్ ఈ మధ్యకాలంలో లేదు .. కానీ భాగ్యశ్రీ అంటే టాలీవుడ్ మాత్రం బాగా ఇష్టపడుతుంది .. ఛాన్సులు ఆమెకు వెతుక్కుంటూ వస్తున్నాయి . ఇప్పుడు సూర్య కు జంటగా ఛాన్స్ వచ్చింది .. అంటే ఇప్పుడు మూడు భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది .. ఇక మరి సూర్యకు భాగ్యశ్రీ అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: