సంక్రాంతి కానుకగా ప్రతి సంవత్సరం పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా కామన్. అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకుంటాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇందులో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోగా... గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.


కాగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా....మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు భారీగా లాభాలను పొందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు పైనే అయింది. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులను zee5 సంస్థ కొనుగోలు చేసింది.


అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ హక్కులను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం అందుతుంది. అయితే ఓటీటీలో రిలీజ్ కు ముందు ఈ సినిమాను టీవీలలో రిలీజ్ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇప్పటికీ ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు ఓటిటీలో భారీగా వ్యూస్ సాధిస్తాయి.


కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ముందుగా టీవీలలో ప్రసారం చేయాలని అనుకుంటున్న సందర్భంగా ఈ సినిమా డిజిటల్ రన్ ఎలా ఉంటుందోనని సందేహంలో ఉన్నారట. అటు ఈ సినిమా కారణంగా నిర్మాత దిల్ రాజు దాదాపు 100 కోట్లకు పైగా ప్రాఫిట్ కలెక్షన్లు వచ్చాయి. అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఈ సినిమా వల్ల దిల్ రాజు భారీగా నష్టాలను ఎదురు చవిచూడాల్సి వచ్చింది. ఆ నష్టాలను గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు బ్యాలెన్స్ చేసుకున్నారు. మరి ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: