తెలుగు హీరోయిన్‌ల‌ను ఉద్దేశించి బేబీ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపిన‌ విషయం తెలిసిందే .. తాము తెలుగు రాని హీరోయిన్లను అభిమానిస్తామని .. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో తనకు తెలిసి వచ్చిందని ఎంటర్ ది డ్రాగన్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. ఇక తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను డైరెక్టర్ సాయి రాజేష్ సంచలన‌ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు .. దీంతో ఎస్కేఎన్ వ్యాఖ్యలపై నెటిజన్లో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు .. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంత అంటున్నారు ..


తెలుగువారు అయ్యుండి తెలుగు సినిమాల్లో మన అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వనంటూ ఇలా కామెంట్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు .. ఇక దీంతో సోషల్ మీడియా వేదికగా ఎస్కేఎన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకిత వస్తుంది . అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై బేబీ నిర్మాత స్పందించారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది తెలుగు హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసాం ..ఫన్ కోసమో, ఫ్లోలోనో ఓ కాంట్రావర్సీకి రూట్ వేసే స్టేట్మెంట్ ఇచ్చారు .. కానీ దీన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడడం మంచిది కాదేమో ? అంటూ ఓ జర్నలిస్ట్ ఎస్కేఎన్ ను  ట్యాగ్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు .. ఇక ఎందుకు ఎస్కేఎన్ .. హహహ ఈమధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. గురూజీ ఏం చేస్తాం చెప్పండి అంటూ స్మైల్ ఎమోజి పోస్ట్ చేశారు ..


దీంతో ఎస్కేఎన్‌ తెలుగు హీరోయిన్లను పరిచయం చేశారేంటి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎస్కేఎన్ చాలామంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేశారు .. రష్మీ, ఆనంది (ఈరోజుల్లో), మానస (రొమాన్స్), ప్రియాంక జవాల్కర్ (టాక్సీవాలా), వైష్ణవి చైతన్య (బేబీ), హారిక (సంతోష్ శోభన్ సినిమా), ఖుషి (3 రోజెస్)  ఈ హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అలాంటి ఈ నిర్మాత ఇలాంటి ఊహించని వ్యాఖ్యలు చేయడంపై ఏదో మర్మం దాగుందని కూడా మరికొందరు అంటున్నారు. ఈ ఇష్యుపై హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏ విధంగా రియాట్ అవుతుందో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: