ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఆమె మోస్ట్ వాంటెడ్ లక్కీ హీరోయిన్ .. గత మూడేళ్లుగా ఆమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది .. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తూ అంతకు మించిన సక్సెస్ అందుకుంటుంది ఈ హీరోయిన్ .. ఇక తన అందంతో పాటు యాక్టింగ్ డాన్స్ పెర్ఫార్మెన్సులతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది .. గత మూడు సంవత్సరాల్లో ఈమె న‌టించిన మూడు సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి .. దీంతో ఇప్పుడు ఆమె పేరు మారు మోగిపోతుంది .. అలాగే ఆమె నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు .. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయి నటించగలదు .. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది .. గత ఎడాది ఆమె నటించిన సినిమా ఏకంగా 1600 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టగా .. ఇప్పుడు థియేటర్లో మరో సినిమాతో సత్తా చాటుతుంది .. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌.


రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతున్న హీరోయిన్ .. ఇటివ‌లే పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించింది ఈ బ్యూటీ .. ఇక ఇప్పుడు చావా సినిమాతో మరో భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుంది .. వీటికి ముందు యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్‌ చేసింది . ఈ సినిమా కూడా 2023లో వ‌చ్చి 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్లో పుష్ప సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. సుకుమార్ , అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయింది .. ఈ సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1850 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.


ఇక ఇప్పుడు ఈమె నటించిన ఛావా సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది .. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది .. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో చత్రపతి స్తంభాజి మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించిగా ఆయన భార్య యెసుభాయ్  పాత్రలో రష్మిక నటించింది .. మహారాణి పాత్రలో రాజ్యసంతో పాటు హుందాగా నటించింది .. ఇప్పటికే ఈ సినిమా 120 కోట్ల మార్కు కలెక్షన్ దాటింది .. ఈ సినిమాతో రష్మిక నటనపై ప్రశంసలు కూడా వస్తున్నాయి.. ఇలా పాన్ ఇండియ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సంవత్సరాల్లో మూడు భారీ విజ‌యాలు అందుకని లక్కీ హీరోయిన్గా మారిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: