అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో గత ఏడాది పుష్ప2  సినిమా విడుదల ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ నటన, రష్మిక యాక్టింగ్ అందరి నటనలతో పుష్ప 2 సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోని సరికొత్త రికార్డులను సృష్టించిన పుష్ప2 మొదటి రోజా 294 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇలా మూడు రోజులలోనే సుమారుగా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. అంచలంచలుగా కలెక్షన్స్ పెరుగుతూ వెళ్ళింది.


పుష్ప సినిమా 32 రోజులలోని 1831 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చివరిసారిగా ఇదే కలెక్షన్స్ పోస్టర్ని రిలీజ్ చేయక ఆ తర్వాత మళ్లీ 50 రోజులకు ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అయితే అక్కడ కలెక్షన్స్ గురించి చెప్పలేదు కానీ కొన్ని సన్నివేశాలను యాడ్ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే చిత్ర బృందం కలెక్షన్స్ పోస్టర్స్ వేయకపోవడంతో ఈ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని ఇండియన్ సినిమా దంగల్ ని రికార్డు బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యిందనే విధంగా వార్తలు వినిపించాయి.


ఇలాంటి సమయంలోనే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా చాలామంది నిర్మాతలు ఇళ్లలో ఐటీ సోదరులు జరిగాయి.. అక్కడ పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో 500 కోట్లు డిఫరెంట్ వచ్చాయనే విధంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా 2300కోట్లు సాధించిందని అందరూ అనుకున్నారు.. కానీ తాజాగా చిత్ర బృందం  పుష్ప 2 కలెక్షన్స్ పైన ఒక పోస్టర్ను విడుదల చేస్తూ ఇప్పటివరకు 1871  గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది అని అధికారికంగా ప్రకటించింది.. జనవరి 6 నుంచి ఇప్పటివరకు కేవలం 40 కోట్లు మాత్రమే రాబట్టింది అని తెలుస్తోంది. దంగల్ సినిమా కలెక్షన్స్ ని కూడా బద్దలు కొట్టలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: