సినీ నటి రష్మిక మందన్న వరుస హిట్ లతో దూసుకెళ్తుంది. ఈమె ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.
అయితే ఈమె రణబీర్ కపూర్ తో కలిసిన నటించిన యనిమాల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి.. మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో ఛావా సినిమాలో నటించింది. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

 లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల అయిన ఈ మూవీలో రష్మిక ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది. సినిమాలో రష్మిక నటన ఎంతో అద్బుతంగా ఉందని చాలా మంది అన్నారు. ఇక వరుసగా రష్మిక మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో.. స్టార్ హీరోయిన్ రేంజ్ ని సొంతం చేసుకున్నారు. మూడేళ్లలో రష్మిక మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి.. తగ్గేదె లే అనే ట్యాగ్ ని సొంతం చేసుకుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: