
ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ రీసెంట్గా అక్కినేని అఖిల్ కోసం ఒక పవర్ఫుల్ కథ రెడీ చేసి వినిపించారు .. అయితే ఆ కథ నాగార్జునకు అంతగా నచ్చలేదు .. ప్రస్తుతం అఖిల్ రిస్క్ చేసే పొజిష్లోను లేకపోవడంతో కాస్త జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది .. దీనితోనే పూరి జగన్నాథ్ ఆ కథను పక్కనపెట్టాడు .. ఇక ఎన్టీఆర్ కోసం కూడా ఒక కథ రాస్తే ఎన్టీఆర్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం లేదు . అందుకే ఆ కథను కూడా పక్కన పెట్టేసారని అంటున్నారు . ఇక నాగా చైతన్య కోసం కూడా ఒక కథ రాశాడని .. ఎంతో ఎగరేసివ్ గా ఉండే చైతన్యకు ఆ కథ బాగుంటుందని పూరి ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ కథకు కూడా అతను ఓకే చెప్పలేదు .. ఇక గోపీచంద్ కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ కథ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి .. గోపీచంద్ కూడా ఈ మధ్యకాలంలో సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు .
ఇక దీంతో విలన్ పాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక మరి పూరి జగన్నాథ్ గోపీచంద్ కోసం మంచి కథ రెడీ చేసి పెట్టుకున్నాడని ఆ కథను గోపీచంద్ కు చెప్పక ఆయన ఓకే చెప్పాడని టాక్ .. వీరి కాంబినేషన్లో 2010లో గోలీమార్ అనే సినిమా కూడా వచ్చింది .. ఈ సినిమా బాగానే ఆడింది ఇక గోపీచంద్ చివరి మూడు సినిమాలు రామబాణం, భీమా, విశ్వం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి .. ఇక దీంతో గోపీచంద్ ఇప్పుడు మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తున్నారు .. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు .. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది .. మరి ఈ సినిమాతో అయినా పూరి గోపీచంద్ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు .