
పంజా వైష్ణవ్ తేజ్ : ఈయన ఉప్పెన మూవీతో హీరోగా పరిచయం అయ్యి ఈ సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక ఆ తర్వాత మాత్రం ఈయనకు కనీసం యావరేజ్ విజయం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఈయన ఉప్పెన మూవీ తర్వాత కొండపొలం , రంగ రంగ వైభవంగా , ఆదికేశవ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి ఈ మూడు సినిమాలతో ఫ్లాప్స్ ను అందుకున్నాడు.
వరుణ్ తేజ్ : ఈయన ఇప్పటి వరకు ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆఖరుగా ఈయన ఎఫ్ 3 సినిమా తర్వాత ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న వరుణ్ తేజ్ కు మంచి విజయం మాత్రం దక్కడం లేదు.
నిఖిల్ : ఈ నటుడు కార్తికేయ 2 సినిమాతో 100 కోట్ల కలెక్షన్లను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన 18 పేజెస్ మూవీ పర్వాలేదు అనే స్థాయి విషయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈయన నటించిన స్పై , అప్పుడు ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఈ నటుడు కూడా 100 కోట్ల సినిమా తర్వాత పెద్ద స్థాయి విజయాలను అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయాడు.