పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎంతో కీలకంగా ఉన్నారు.. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. పవన్ అభిమానులు ఎక్కడ చూసినా ఓజీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . అయితే ఇప్పుడు చావా సినిమా రిలీజ్ తర్వాత పవన్ న‌టిస్తున్నా హరిహర వీరమల్లు సినిమాపై కూడా భారీ అంచనాలు నెల‌కున్న‌యి .. కానీ నిజానికి చావాను మించిన చరిత్ర ఆత్మిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారనేది థియేటర్లో తెలుస్తుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ..


అలాగే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్ ప్రకారం హరిహర వీరమల్లు సర్వాయి పాపన్న గౌడ్‌ కథ ఆధారంగా రాసుకున్నారట‌ ... ఈ గొప్ప యోధుడి పూర్తి పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ .. 1650 లో జన్మించిన శైవ మతస్థుడే అయినప్పటికీ కులాలు , మతాలకతీతంగా ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. తురుష్క్ సైనికులు పన్నులు వసూలు చేసే క్రమంలో కళ్ళు గీసే వ్యాపారం చేస్తున్న పాపన్నతో ఒక స్నేహితుడు వల్ల వారితో తగు పెట్టుకుంటాడు .. దీంతో విసుకు చెంది ఉగ్రరూపం చెందిన పాపన్న వాళ్ళ తల నరకడమే కాకుండా ఊరు వాడ ఏకం చేసి మూడు వేల మందితో పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటాడు ..


మహారాష్ట్రలో చత్రపతి శివాజీకి సమానంగా మొగల్ సామ్రాజ్య ఒంటెద్దు పోకడలపై యుద్ధం చేసి గెలిచిన ఖ్యాతి ఈయన పేరు మీద ఉంది .. అలాగే 1700 సంవత్సరం సమయంలో గోల్కొండ దాకా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 20 దాకా కోటలను గెలుచుకున్న పాపన్న సాహసాలకు నిజాం రాజులు సైతం జడిసిపోయారు. ఇలా అప్రతిహతంగా జరిగిపోతున్న పాపన్న జైత్రయ‌త్రలో చావాలో శంబాజీకి జరిగినట్టే పాపన్నకు ఇంటి వారితోనే ద్రోహం జరిగి పట్టుపడ్డాడు .. ఆ తర్వాత జరిగేది ఊహకు అందనంత గొప్పగా ఉంటుందట .. ఇక్కడ చెప్పింది కొన్ని విషయాలే కానీ హరిహర వీరమల్లు కోసం కేవలం పాపన్నకు సంబంధించిన ప్రధాన నేపథ్యాన్ని మాత్రమే తీసుకొని ఎన్నో మార్పులు చేశారని తెలుస్తుంది .. అధికారికంగా సర్వాయి పాపన్న కథ అని టీం ప్రకటించినప్పటికీ .. ఊహించని విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఎప్పుడూ చూడని అబ్బురపరిచే  యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉంటాయట .. అలాగే బాహుబలి తరహాలో మొదటి భాగానికి మించి సీక్వెల్ కోసం ఎదురుచూసే స్థాయిలో ఎండింగ్ ఉండబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: