సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో తీయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ శాతం కథ చర్చల సమయంలోనే ఒకరితో అనుకున్న సినిమాలను మరొకరితో రూపొందించడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఒక ముద్దుగుమ్మను ఒక సినిమాలో హీరోయిన్గా అనుకొని , అంతా ఓకే అయ్యాక సినిమా షూటింగ్ను కూడా మొదలు పెట్టి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యాక ఆ మూవీ నుండి హీరోయిన్ను తీసేయడం లాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటన ఓ ముద్దుగుమ్మ విషయంలో జరిగింది. ఆమె ఆ తర్వాత నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి కూడా చేరుకుంది. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ లో మొదట కాజల్ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను తీసుకొని ఆమెపై కొన్ని రోజుల షూటింగ్ను కూడా పూర్తి చేశారట. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆ పాత్రకు సెట్ కాదు అనే ఉద్దేశంతో ఆమెను తీసేసి ఆ పాత్రలో కాజల్ అగర్వాల్ ను పెట్టుకున్నారట. ఇక ఆ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే కాజల్ అగర్వాల్ కి కూడా ఆ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఆ తర్వాత రకుల్ "వెంకటాద్రి ఎక్స్ప్రెస్" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈ బ్యూటీ ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: