
అయితే అలాంటి ఈ హీరో ఓ డైరెక్టర్ ని తనతో సినిమా చేయమని స్వయంగా చెప్పారట. కానీ తీరా డైరెక్టర్ కథ చెప్పాక మొహం మీదే ఉమ్మేసారట. ఇక ఆ డైరెక్టర్ ఎవరంటే సుశీంద్రన్. డైరెక్టర్ సుశీంద్రన్ హీరో జై తో ఈశ్వరన్ అనే సినిమాని తీద్దామనుకున్నారట.కానీ ఓ సందర్భంలో హీరో శింబు డైరెక్టర్ సుశీంద్రన్ ని కలిసి నాతో సినిమా చేయండి అని అడగడంతో జై కోసం రాసుకున్న కథని శింబు తో చేద్దాం అనుకున్నారట.
ఇక ఈ స్టోరీ శింబుకి చెప్పగా ఈ స్టోరీ అస్సలు బాలేదు అని మొహం మీదే ఉమ్మేసారట. దాంతో యాక్టింగ్ కి తగ్గట్టుగా ఈ కథని మార్పులు చేర్పులు చేసి చివరికి శింబుతో సినిమా తెరకెక్కించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈశ్వరన్ సినిమా అంతగా అలరించకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుశీంద్రన్ చెప్పారు. ప్రస్తుతం డైరెక్టర్ మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ కథ నచ్చకపోతే ఎవరైనా మొహం మీద ఉమ్మేస్తారా రిజెక్ట్ చేయాలి కానీ అంటూ కామెంట్లు పెడుతున్నాడు