టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గత ఏడాది నటించిన ఊరిపేరు బైరవకోన, రాయన్ సినిమాలతో మంచి గుర్తింపు తన సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మజాకా మూవీకి ధమ్కీ ఫేమ్ లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ధమాకా మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ అలాగే జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మజాకా సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా పనిచేస్తున్నాడు. ఈ సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
 
అయితే ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన పొందాయి. షూటింగ్ మొదలు అయినప్పటినుంది ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు.. కానీ పలు కారణాల వలన అది వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాని మహాశివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శివరాత్రి కానుకగా ఈ నెల 26న మజాకా సినిమా విడుదల కానుందని తెలిపారు.


ఇదిలా ఉండగా.. ఇటీవల సందీప్ కిషన్ ఫ్యాన్ వార్ ల పైన స్పందించారు. 'ఈ మధ్యకాలంలో ఫ్యాన్ వార్ లు చాలా చెత్తగా మారాయి. అంతా చెత్తగా ఉంటాయని అసలు అనుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పీఆర్ టీమ్ ఉంటుంది. ఈ ట్రెండ్ ముంబై లో ఎప్పటినుండో ఉంది.. ఇక్కడ ఇప్పుడే మొదలైంది. మన తరుపున మాట్లాడడానికి కచ్చితంగా ఒక టీమ్ ఉండాలి. మన గురించి జనాల్లోకి తీసుకెళ్లాడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా' అంటూ పీఆర్ గురించి సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: