
మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటించారు. ప్రకాష్ రాజు నటన జయసుధ తదితర నటీనటుల నటన కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు మార్చి 7వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అటు వెంకటేష్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చేస్తున్నారు. కుటుంబ విలువలు, మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమానురాగాలు, జీవిత సత్యాలు వంటివి ఇందులో చాలా గొప్పగా చూపించారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కించగా దిల్ రాజు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు మరొకసారి థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.
ఇక డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఒక సరికొత్త నాందికి తెర తీసిందని చెప్పవచ్చు. ఇక మహేష్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తూ ఉండగా వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకొని 300 కోట్ల క్లబ్ లోకి చేరారు. అభిమానులు మాత్రం మరొకసారి ఏదైనా సినిమాలో కలిసి నటించాలి అంటూ కోరుకుంటున్నారు.