మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఈ రీసెంట్‌ టైమ్స్ లో ఎక్కువగా వార్తల్లోనే ఉంటుంది .. మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వివాదం అలానే కొనసాగుతుంది .. రోజుకొక ఏదో ఒక పంచాయతీ వీరి మధ్య నడుస్తూనే ఉంది .. అయితే మోహన్ బాబు ప్రస్తుతం తన పెద్దకొడుకు విష్ణు తెర‌కెక్కిస్తున్న కన్నప్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు . అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు.. అదే విధంగా మంచు మనోజ్ సైతం బైరవం సినిమాతో ప్రేక్షకులు ముందుగా రాబోతున్నారు .. అలాగే మరో రెండు మూడు సినిమాలను ఓకే చేశారు .. అయితే ఈ వివాదంలో కానీ బయట ఎక్కడా కూడా మంచు లక్ష్మీ మాత్రం కనిపించడం లేదు .. అయితే గత కొద్దిరోజులుగా మంచు లక్ష్మి సైలెంట్ గా ఇంటిలోనే ఉంటున్నారు.. అలాగే సినిమాల్లో కాని సోషల్ మీడియాలో కాని ఎక్కడ పెద్దగా అనిపించడం లేదు .. మొన్నటివరకు లక్ష్మీప్రసన్న నటిగా నిర్మాతగా టాలీవుడ్లో తానా ప్రతిభను చాటుకున్నారు.


అలాగే చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు .. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ను మొదలు పెట్టిన మంచు లక్ష్మి ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు నటించింది .. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది .. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కూడా నటించింది .. అలాగే నిర్మాతగాను చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది .. అయితే లక్ష్మీ ప్రసన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది .. పెళ్లి తర్వాత మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .. అలాగే కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి .. కానీ ఎప్పుడూ మంచు లక్ష్మీ తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు.


అయితే ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచి లక్ష్మి తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది .. ఇక మంచు లక్ష్మి భర్త పేరు అండి శ్రీనివాస్ .. ఇతను ఫారేన్ లో ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు .. తాజాగా మంచు లక్ష్మి తన భర్త గురించి మాట్లాడుతూ తాము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని కూడా చెప్పుకొచ్చింది .. అలాగే సమాజంలో ప్రశాంతంగా బతికేలా స్వేచ్ఛను ఇచ్చి పుచ్చుకుంటున్నామని కూడా తెలిపింది .. న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో జీవిస్తున్నామని కూడా చెప్పింది ..  ప్రైవసీ, పర్సనల్ రెస్పాన్సిబిటీ లకు ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పుకొచ్చింది .. మాకు ఎలా అనిపిస్తే అలా ఉంటున్నామని కూడా మంచు లక్ష్మీ అంటుంది .. బయట జనాలు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ మా ప్రశాంతతను మేము కోల్పోలేమని కూడా తెలిపింది .. ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉంటాన్నా అని కూడా చెప్పుకొచ్చింది .. ఇటీవలే  రెండు నెలలు తన భర్తతో కలిసి ఉన్నా ని అలాగే తన కూతురు ఇప్పుడు తన భర్త దగ్గర ఉందని కూడా ఆమె చెప్పుకు వచ్చింది. మంచు లక్ష్మి చేస్తున్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: