మన చిత్రపరిశ్ర‌మ‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి .. అయితే ప్రేక్షకుల్ల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి .. అలాంటి ఓ సినిమానే 1972లో విడుదలైంది .. ఇక ఇది థియేటర్లో భారీ విజయాన్ని కూడా అందుకుంది .. ఈ సినిమా చాలా రోజులు థియేటర్లో ఆడింది.. ఈ సినిమా పేరు పకీజా .. ఫిబ్రవరి 4 , 1972లో విడుదలయింది .. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఈ సినిమాలో నటించిన మీనా కుమారి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది .. ఈ వార్త అభిమానులను తీవ్రంగా ప్రభావితం చేసింది .. బాలీవుడ్ లెజెండ్రీ క్వీన్ మీనా కుమారి నిజ జీవితం ఎంతో బాధాకరంగా ఉందో ఆమె సినీ జీవితం కూడా అంతే సక్సెస్ అయింది ..


తెరపై ప్రతి పాత్రలను తన ఆత్మను మనసును అంకితం చేసి న‌టించేది  మీనా కుమారి .. కానీ జీవితాంతం ప్రేమ కోసమే పోరాడింది . కానీ మీనా కుమారి తనకంటే 37 సంవత్సరాల పెద్దవాడైన నిర్మాత కమల్ అమ్రోహిని పెళ్లి చేసుకుంది కానీ అప్పటికి అతనికి పెళ్లయింది. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో దుఃఖం ఆవేదన తప్ప ఏమి కనిపించలేదు .. ఇక మీనా కుమారి నటించిన ఐకానిక్ సినిమా ‘పకీజా’ను .. ఈమె భర్త కమల్ అమ్రోహి దర్శకత్వహించారు ఈ సినిమా తీయడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు కాదు దాదాపు 15 సంవత్సరాలు సమయం పట్టింది .. కమల్ అమ్రోహి , మీనా కుమారి మధ్య విభేదాలు రావటమే ‘పకీజా’ ఆలస్యానికి అసలు కారణమని మీడియా నివేదికలు చెబుతున్నాయి ..


ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మీనా కుమారి కమల్ అమ్రేహి విడాకులు తీసుకుని విడిపోయారు .. ఆ తర్వాత, ఆమె ఆ దర్శకుడితో పనిచేయడానికి ఇష్టపడలేదు .. వీటితోపాటు సినిమా షూటింగ్స్ స‌మ‌యంలోనే హీరోయిన్ ఆరోగ్యం సైతం క్షీణించింది .. కానీ దర్శకుడు నుంచి అనేక అభ్యర్థనల తర్వాత ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అలా ‘పకీజా’ రిలీజ్ అయిన రెండు నెలలకే మీనా మరణించారు .. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వడిదుడుకులను, అవమానాలను మర్చిపోవడానికి ఆమె మద్యానికి బానిసయింది .. దాంతో ఆరోగ్యం బాగా పాడైపోయింది పకీజా సినిమా రిలీజ్ అని రెండు నెలలకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది 1972లో రిలీజ్ అయిన పకీజా మీన కుమారి చివరి సినిమా .

మరింత సమాచారం తెలుసుకోండి: