- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగు చిత్ర పరిశ్రమలో  ఎప్పుడు ఇదే జరిగేది .. ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించడం ఆ తర్వాత ఆ టార్గెట్ అందుకోలేక తప్పుకోవటం ఎప్పుడు కామన్ గా జరుగుతూ వస్తుంది .. అలా బ్యాక్ టు బ్యాక్ రావాల్సిన రెండు సినిమాలు ఇప్పుడు ముందుగా అనుకున్న తేదీల నుంచి తప్పుకున్నాయి .. వాటి లో ఒకటి రాజా సాబ్ ఇంకొకటి మిరాయ్ .. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాభ్‌ సినిమా తప్పుకున్న‌ సంగతి అందరికీ తెలిసిందే  . లెక్క ప్రకారం ఏప్రిల్ 10 న ఈ సినిమా రిలీజ్ కావాలి .. కానీ ఇప్పుడు దసరా పండుగ తేదీ కోసం ట్రై చేస్తున్నారు . ఇక రాజా సాభ్‌ వచ్చిన వారం రోజులకే మిరాయ్‌ రాబోతున్నట్టు గతంలో ప్రకటించారు మేకర్స్  ..


ఈ సినిమాని కూడా ఏప్రిల్ 18 న థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చారు .. ఇక‌ ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడింది . తేజ సజ్జా హీరో గా నటిస్తున్న మిరాయ్‌ ఈ సినిమాను ఏప్రిల్ నుంచి ఆగస్టు కు పోస్ట్ పోన్ చేశారు .. ఆగస్టు 1 న మిరాయి వస్తుందంటు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు . కార్తీక్ ఘట్టమ‌నేని  దర్శకత్వం లో తెరకెక్కుతుంది మిరాయి .. ఒకేసారి 8 భాషల్లో 2d , 3d వైర్ష‌న్ల‌లో రిలీజ్ చేస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది . హనుమాన్ లో సూపర్ హీరో గా కనిపించిన తేజసినిమా లో కూడా సూపర్ యోధుడిగా కనిపించబోతున్నాడు .. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు .. ఇలా మొత్తానికి ఏప్రిల్ నుంచి రెండు పెద్ద సినిమాలు పక్కకు వెళ్లిపోయాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: