టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఈమె హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో భారీ ఇమేజ్ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా ఇటీవలే విడుదలైన ఛావా సినిమాతో మరొక సక్సెస్ ని అందుకున్నది. దీంతో రష్మిక ఇమేజ్ కూడా తారాస్థాయికి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. శంభాజీ మహారాజ్ భార్యగా ఏసుబాయ్ పాత్రలో రష్మిక నటించిన తీరు అందరి చేత ప్రశంసలు కురిపించేలా చేసింది.


ప్రతి సినిమాకి కూడా తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది రష్మిక. అలా ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి అవలీలగా మారిపోతోంది. యానిమల్ సినిమాలో రొమాంటిక్ పాత్రలో నటించగా పుష్ప చిత్రంలో మాస్ పాత్రలో నటించగా ఛావా సినిమాలో మరింత అద్భుతమైన పాత్రలో నటించింది. అలా రష్మిక ప్రతి సినిమాతో కూడా పాన్ ఇండియన్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. ఏసుభాయి పాత్రలో  బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలను కూడా పక్కకి నెట్టేసిందట. దీంతో ప్రస్తుతం రష్మిక పరిస్థితి చూస్తే ఈ అమ్మడిని ఇప్పట్లో టచ్ చేసి హీరోయిన్ కూడా లేదని ఈమెకు పోటీగా మరొక హీరోయిన్ కూడా రావడం సాధ్యం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఆలియా భట్ మాత్రం రష్మికని బీట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక సాయి పల్లవి కూడా ప్రస్తుతం రామాయణం అనే చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే తప్ప తన నటన ఎలా ఉందనేది ప్రూఫ్ అవ్వదు.. మరి రష్మికకు పోటీకి సాయి పల్లవ లేకపోతే ఆలియా భట్ అన్న విషయం తదుపరి చిత్రాల విడుదలను బట్టి అది ఖాయం అవుతుంది. మొత్తానికి అటు కోట్లల్లో సంపాదిస్తూ భారీగానే పేరు సంపాదించింది రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి: