టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈయన ఇటీవలే శోభితా ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరిగి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో నాగ చైతన్య ఇన్ని రోజులు నెగిటివిటీ చూశాడు. ఇక నాగ చైతన్య, లేడి పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులకు మనసు దోచుకుంది. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది.  హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది.
అయితే నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గొప్ప మనసును చాటుకున్నారు.  తాజాగా వీరిద్దరూ హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ కి వెళ్లారు. అక్కడ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న చిన్నారులను కలిశారు. వారితో సరదాగా మాట్లాడి, కాస్త సమయం వారికి కేటాయించి.. దైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: