బాలీవుడ్‌ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ కూడా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో 'గౌరవనీయులైన ప్రధాని మోదీ ఛావా మూవీని ప్రశంసించడం. అలాగే ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించడం గర్వించదగిన గొప్ప క్షణం' అని విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు.
 
ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దినేష్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేశారు. ఈ సినిమాకు రెహమాన్‌ సంగీత అందించారు. ఈ సినిమాతో వీరిద్దరూ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల అయ్యింది.
రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది.


ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది. కానీ సినిమాలో రష్మిక ఎంత అద్బుతంగా నటించినప్పటికి విక్కీ కౌశల్ ని బీట్ చేయలేక పోయింది. విక్కీ, శంభాజీ మహరాజ్‌ పాత్రలో జీవించేశాడని చాలా మంది అన్నారు. విక్కీ ఆ పాత్రకు ప్రాణం పోశాడాని.. నిజంగా శంభాజీ మహరాజ్‌ ఉండి ఉంటే ఇలా ఉండేవాడా అని అనుకునేల విక్కీ నటించడాని టాక్ వినిపించింది. ఈ సినిమా కోసం విక్కీ శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: