మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు .. బిబిసారా దర్శకుడు మల్లిడి వశిష్ట్  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దసుకు వచ్చింది .. మార్చ్ ఎండింగ్ నాటికి విశ్వంభర షూటింగ్ పూర్తి అవుతుంది .. అయితే తర్వాత  ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు చిరు .. అటు విశ్వంభర డబ్బింగ్ పనులు పూర్తి చేసి దర్శ‌కుడు అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా పై ఫోకస్ పెట్టబోతున్నాడు .


2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది .. ఆ తర్వాత చిరు దసరా దర్శకుడుశ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు .. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది .. హీరో నాని తో కలిసి సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తారు .. . 2026 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని.. నిన్న ‘కోర్ట్’ సినిమా ఈవెంట్లో భాగంగా నాని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే . అయితే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది .


అసలు విషయం ఏమిటంటే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట .. చిరంజీవి ఈ తరహా కథ గతంలో ఎప్పుడు చేయలేదని కూడా అంటున్నారు .. విక్రం లో కమలహాసన్ జైలర్లో రజిని మాదిరి .. వయసు మీద పడ్డ వ్యక్తిగా ఇందులో చిరంజీవి కనిపిస్తారని అంటున్నారు .. అలాగే చిరంజీవికి జంటగా ఓ సీనియర్ హీరోయిన్ను  తీసుకోబోతున్నారని తెలుస్తుంది .. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీని అందుకోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది .. అయితే ఇదే నిజమైతే కనుక రాణి ముఖర్జీ తెలుగులో చేయబోయే మొదటి సినిమా కూడా ఇదే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: