టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం బాగానే పెరిగింది. అందుకు కారణం గతంలో అల్లు శిరీష్ తో నటించిన ఒక సినిమాతో ఈమె అల్లు వారి కోడలు కాబోతోందని విధంగా వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత అవకాశాలు కూడా సరిగ్గా రాలేకపోవడంతో ఈమె పేరు కనుమరుగయ్యింది. ఇలాంటి సమయంలోనే తాజాగా అను ఇమ్మాన్యుయేల్ ఒక హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమాలు నటిస్తూ ఉన్నది.


ఈ చిత్రంలో శివ కందుకూరి ప్రధాన పాత్రల నటిస్తూ ఉన్నారు.  తాజాగా బూమరాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.అను ఇమ్మాన్యుయేల్ ఒక బిల్డింగ్ లోకి వెళ్లడం అక్కడ ఎవరో ఉన్నారని తాను అనుకోవడంతో పాటు ఆ బిల్డింగులో చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు చంపుతూ ఉన్నట్టుగా చూపించారు. ఆ ఇంట్లోనే అను ఉన్నట్టుగా చూపించారు. చూడడానికి గ్లింప్స్ చాలా భయంకరంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి ఇచ్చినటువంటి బిజిఎం హైలైట్ గా నిలుస్తోంది.


ఈ చిత్రాన్ని ఆండ్రివ్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తూ ఉన్నది. బూమరాంగ్ సినిమా మరి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. అను కెరియర్ విషయానికి వస్తే మొదటిసారి హీరో నాని నటించిన మజ్ను అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాలను గ్లామర్ రోజు ఉన్న పాత్రలలో నటించినప్పటికీ ఏ సినిమాలు కూడా సక్సెస్ కాలేకపోయాయి. చివరిగా అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాలో నటించింది.  బూమరాంగ్ సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: