టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన AMR గ్రూప్ చైర్మన్, A. మహేష్ రెడ్డి కుమారుడి పెళ్లి దుబాయ్ లో ఘనంగా జరుగుతోంది ఈ పెళ్లికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులందరూ దుబాయ్ కి వెళ్తున్నారు. మహేష్ రెడ్డి భక్తి చిత్రాలైన శిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ పెళ్లి కోసమే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తన భార్యతో కలిసి దుబాయ్ కి వెళుతున్నారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతపెళ్లి కోసం దుబాయ్ కి వెళ్లారు. అక్కడ నమ్రత, ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కలిసి ఓ గ్యాంగ్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే తన తదుపరి సినిమా కోసమే ఎన్టీఆర్ తన పూర్తి లుక్ ని మార్చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.


ప్రస్తుతం ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయింది. కొద్దిరోజుల తర్వాత దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర-2 సినిమా కూడా తీయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా అభిమానుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: