సౌత్ స్టార్ హీరో ధనుష్‌ ప్రస్తుతం వ‌రుస‌ సినిమాల తో బిజీగా ఉన్నారు .. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు .. అలాగే హీరో గానే కాకుండా దర్శకుడు గాను సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు .. ఇప్పటికే డైరెక్టర్గా రాయన్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నట్టు ధ‌నుష్ .. ఇక రీసెంట్ గానే జాబిలమ్మ నీకు అంత కోపం సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు .. ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేస్తుంది ..  అలాగే హీరో గాను వ‌రుస‌ సినిమాలను లైన్లో ఉంచారు .. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు ధనుష్ .. అయితే ఇప్పుడు తాజాగా ఓ హీరోయిన్ ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించింది .. ధనుష్ వాళ్ళ తన కల నెరవేరింది అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది .. ఇంతకీ ఆమె ఎవరు .. ఎందుకు ధనుష్ కు కృతజ్ఞతలు తెలిపింది .. అనేది ఇక్కడ చూద్దాం.
 

ధనుష్ డైరెక్షన్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా ? సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ , అనిఖా సురేంద్రన్ హీరోయిన్లుగా నటించారు .. ఇక అనిఖా సురేంద్రన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది ,, అజిత్ హీరోగా వచ్చిన వరుస‌ సినిమాల్లో ఆయనకు కూతురుగా నటించి మెప్పించింది .. ఇక ఇప్పుడు ఈమె హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది .. ఇక తెలుగులో బుట్ట బొమ్మ సినిమాతో ఆకట్టుకుంది అనిఖా ..

 

అయితే ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో మంచి విజయం అందుకుంది .. తాజాగా అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ ధనుష్ పై ప్రశంసలు వర్షం కురిపించింది .. సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ ఆసక్తికర పోస్ట్ ని కూడా షేర్ చేసింది .. జాబిలమ్మ నీకు అంత కోపమా ముగిసింది .. ధనుష్ సార్ కి ఎప్పటికీ నా కృతజ్ఞతలు .. మీరు నా కలను నెరవేర్చారు .. ధనుష్ గారికి నేను పెద్ద అభిమానిని నేనొక సినిమా ఛాన్స్ కావాలని అడిగాను దాంతో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు .. ధనుష్ దర్శకత్వంలో నటించడం అనేది నేను నా కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు .. ధనుష్ సార్‌కు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సోష‌ల్‌ మీడియా వేదిక‌గా భారీ పోస్టును రాసుకు వచ్చింది .. అనిఖా సురేంద్రన్ .. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: