టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు హీరోయిన్ గా ఉండి ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ మహేష్ బాబు సక్సెస్ కి కారణం అవుతుంది. అలాగే తన కొడుకు ,కూతురు సంబంధించిన అన్ని విషయాలను కూడా దగ్గరుండి మరి నమ్రతానే చూసుకుంటుందట. అంతేకాకుండా టాలీవుడ్ కి ఎక్కడ ఎలాంటి ఈవెంట్ జరిగిన కూడా ఖచ్చితంగా మహేష్ బాబు కానీ ఆయన భార్య నమ్రత కానీ హైలెట్గా నిలుస్తూ ఉంటారు.


మొన్న మధ్య వైఎస్ షర్మిల కొడుకు వివాహం దగ్గర కూడా నమ్రత హైలెట్ గా నిలిచింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వాణి పెళ్లిరోజులో కూడా హైలెట్గా నిలిచింది నమ్రత. అయితే ఇటీవలే దుబాయ్ లో జరిగిన ఒక ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్ కి కూడా నమ్రత ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఎటువంటి ఈవెంట్కైనా సరే నమ్రతకు ఆహ్వానం అందితేనే తప్ప లేకపోతే వెళ్ళదట. ఎప్పుడూ కూడా మహేష్ ను నీడల ఉండే నమ్రత తమ సర్కిల్లో ఉండే ప్రతి ఈవెంట్ కి కూడా అందరితో మంచి బాండింగ్ ఉందని కూడా చెప్పవచ్చు.



అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమ్రత మాత్రమే కనిపిస్తూ మహేష్ బాబు పక్కన నమ్రత కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం మహేష్ బాధ్యతలను ఇలా తన మీదకు వేసుకొని మరి అన్ని చోట్లకు నమ్రత వెళ్తోంది అంటూ తెలుపుతున్నారు. అందరితో కలిసి తన సమయాన్ని ఇలా గడిపేస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే పిఆర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది నమ్రత. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఏ ఈవెంట్ కి కూడా హాజరు కాలేదట. ముఖ్యంగా రాజమౌళి సినిమా కాబట్టి అన్ని కండిషన్స్ ని వర్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: