స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2. గత ఏడాది విడుదలై ఎవరు ఊహించని విధంగా రికార్డులను తిరగరాసింది. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించగా.. ఇతర భాషల నుంచి కూడా నటీనటులు నటించారు. పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసి, ఎలాంటి ఘనతలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 సినిమా హిందీలో అయితే ఏకంగా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను తిరగరాసింది. సుమారు రూ.820 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు అక్కడి ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.


అయితే ఇదే సమయంలో 2021లో పుష్ప సినిమా విడుదలై బాలీవుడ్ ఆడియన్స్ ను సూపర్ హిట్ గా ఆకట్టుకుంది. అప్పుడు ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది . పుష్ప1 సక్సెస్ అవ్వడానికి గోల్డ్ మై టెలిఫిలిమ్స్ మనీష్ షా అక్కడ కీలకంగా వ్యవహరించారట. అయితే పుష్ప 2 సినిమా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయలేదట. దీంతో ఈ సినిమా పైన ముందు నుంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఎందుకు తీసుకోలేకపోయారు అనే విషయం పైన చాలా ఊహాగానాలు కూడా వినిపించాయట.

పుష్ప మొదటి భాగం హిందీ హక్కులు రూ.30 కోట్లకు మనిషా కొనుగోలు చేశారట. దీంతో భారీ లాభాలను అందుకున్న ఆయన..  ఆ తర్వాత నిర్మాతలు వచ్చి ఆదాయంలో కూడా వాటా కూడా అడిగినట్లు వార్తలు వినిపించాయి.  అందుకు మనీష్ మాత్రం ఒప్పుకోలేదని, ఆ తర్వాత అనిల్ తడాని పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్ హక్కులను సైతం రూ.200 కోట్లకు కొనుగోలు చేశారట. అయితే ఇప్పుడు మనీష్ భారీ లాభాలు మిస్ అయ్యారని కొంతమంది నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తూ ఉండగా.. ఆ సమయంలోనే మనీష్ షా తీసుకొని ఉంటే మరింత లాభం వచ్చేదని అభిమానులు అభిప్రాయంగా తెలుపుతున్నారు. మొత్తానికి పుష్ప 2 చిత్రంతో భారీ లాభాలను మిస్సయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: