టాలీవుడ్‌లో కొత్తదనానికి ప్రాధాన్యమిచ్చే హీరోల్లో నాని ముందువరుసలో ఉంటాడు. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నాని చేసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా నాని కొనసాగుతోన్నాడు. హిట్ 3తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ప్రొడ్యూసర్‌గా కోర్టు సినిమాను నిర్మిస్తున్నాడు.అలాగే నాని 'ది ప్యారడైజ్' అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నేచురల్ స్టార్ నాని ఈ రెండు సినిమాలతో పాటు మరొక యంగ్ డైరెక్టర్‌కు చాన్స్ ఇచ్చాడని సమాచారం. ఇంతకీ అతను మరెవరో కాదండోయ్ శిబి చక్రవర్తి. ఈ యంగ్ డైరెక్టర్ హీరో నాని కోసం ఓ కథను సిద్ధం చేశాడట. అయితే నానిని కలిసి స్టోరీని వినిపించాడట.

ఇక కథ నచ్చడంతో నాని కూడా ఓకే చెప్పాడట. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మరి మున్ముందు ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ క్రమంలోనే తమిళంలోనూ హీరోగా తన లక్‌ను పరీక్షించుకున్నాడు నాని. రెండు సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. వెప్పం మూవీతో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అంజనా అలీఖాన్ దర్శకత్వం వహించింది.ఈ మూవీలో నిత్యామీనన్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటించారు. సెగ పేరుతో తెలుగులోకి వెప్పం మూఈ డబ్ అయ్యింది. ఈ సినిమా రెండు భాషల్లో డిజాస్టర్‌గా మిగిలింది. వెప్పం సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మించడం గమనార్హం.ఆ తర్వాత ఆహా కళ్యాణం పేరుతో మరో తమిళ సినిమాలో హీరోగా నటించాడు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: