ఇక మన సౌత్ ఇండస్ట్రీలోని ఆమె టాప్ హీరోయిన్ .. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ పరిశ్రమ లోనే అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది .. మరె కాదు త్రిష .. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను అదరగొడుతుంది .. తెలుగు , తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చూపిస్తుంది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ప్రజెంట్ బాక్సాఫీస్ దగ్గర వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోతున్న త్రిష .. 40స్ లోను కుర్ర హీరోయిన్లకు గట్టి షాక్ ఇస్తుంది .. రీసెంట్ గానే అజిత్ కి జంటగా పట్టుదల సినిమాతో అలరించిన త్రిష ఇప్పుడు చిరంజీవికి జంటగా విశ్వంభర లోను నటిస్తుంది .
 

తమిళనాడులో జన్మించిన త్రిష .. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి .. 1999లో నటుడు ప్రశాంత్ నటించిన జోడి సినిమాల్లో చిన్న పాత్రలో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టింది .. ఇందులో హీరోయిన్ సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించింది. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు త్రిషకు హీరోయున్గా అవకాశం వచ్చింది ..2002 లో మౌనం పెసియాతే  సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి .. ఆ తర్వాత తెలుగు , తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది.

 

ఇలా తన 25 ఏళ్ల సినీ జీవితంలో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ స్టార్ డంను అందుకుంది .. అయితే కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ  మరోసారి తన జోరు చూపిస్తుంది .. ఈ సంవత్సరం ఆమె చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. అయితే త్రిష 1999 సెప్టెంబర్ 30న జరిగిన మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది .. అయితే అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాల మాత్రమే .. అతి చిన్న వయసులోనే మిస్ చెన్నైగా  నిలిచి ఆరుదైన రికార్డును త్రిష తన ఖాతాలో వేసుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: