టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారుండారు. ఆయనకు యంగ్ స్టార్స్ నుండి ఏజ్ అయిన వాళ్లదాకా ఫాన్స్ ఉన్నారు. బాలయ్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. ఇక ఇటీవలే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా థియేటర్ లో విడుదల అయ్యి.. మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చెరిపోయింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.   
ఇదిలా ఉండగా.. బాలయ్య బాబు ఫాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు ఈ సినిమా తర్వాత అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. అఖండ 2: తాండవం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ సినిమాపై హీరో ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఈ సారి అఖండ 2 సినిమా అంచలనాలను మించి ఉంటుంది. ఈ సినిమా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదండి దాన్ని దాటి వెళ్తుంది. అఖండ 2 సినిమా స్క్రిప్ట్ లో ఆ దమ్ముంది. నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది. విలన్ పాత్రలో నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది' అని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: