టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య, లేడి పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చాలా బాగా నటించారు. వారిద్దరి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది అంట. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది.

ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.


అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకున్న సందర్భంగా ఇటీవల తండేల్ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో అందాల భామ బాంధవి మెరిసింది. ఈమె మసూద హారర్ సినిమాలో దెయ్యంగా నటించిన విషయం అందరికీ తెలుసు. ఆ పాత్రలో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ భామ 2019లో మిస్ ఇండియా, అలాగే మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకన్ గా కూడా నిలిచింది. అయితే బాంధవి చాలా రోజులుగా కనిపించకుండా.. ఒక్కసారిగా తండేల్ సినిమా ఈవెంట్ లో కనిపించే సారికి అందరి చూపులు తనపైననే పడ్డాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: