తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన తో మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి .. ప్రముఖ నిర్మాత కేదార్ దుబాయి లో మరణించడం ఆయన మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశారు .. డ్రగ్స్ కేసు నిందితులంతా ఒక‌రి తర్వాత ఒకరు ఎందుకు ఇలా చనిపోతున్నారు ? ఎలా మరణిస్తున్నారు ? దీనిపై విచారణ కావాలి ? అంటూ సీఎం రేవంత్ రెడ్డి అనటం  తేనె తుట్టును కదిపినట్టుగా అయింది . టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతో కాలంగా విచారణ లో ఉంది .. మధ్య మధ్య లో సినిమా ప్రముఖులను పట్టుకున్న వైనం కూడా ఉంది కానీ ఇవన్నీ విచారణ లోనే ఉన్నాయి .


ఇప్పుడే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం తో పోలీసులు కూడా ఒక్కసారి గా అప్రమత్తమయ్యే చాన్స్ ఉంది .. కేసులు బయట కు తీసి అవి ఏ పోసిషన్లో ఉన్నాయి .. అనేవి అప్డేట్ చేసే అవకాశం కూడా ఉంది .. ఇక కేదార్ మరణం టాలీవుడ్ లో భారీ ప్రకంప‌నలు క్రియేట్ చేసింది .. అందు లోనూ దుబాయిలో చనిపోవడం ఇప్పటి వరకు మృతదేహం ఇక్కడి కి రాకపోవటం అన్నది పలు అనుమానాల కు దారితీస్తుంది . ఇక కేదార్ టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులకు అత్యంత సన్నిహితుడు .. గొప్ప స్థితి కి వెళ్లిన వాడు .. అక్కడి నుంచి కిందికి వచ్చాడు . అయినా అతని స్నేహాలు మాత్రం అంతే బలంగా ఉన్నాయి .. అయితే ఇప్పుడు కేదార్ తో సానిహిత్యం ఉన్న వారం తా సైలెంట్ గా ఉన్నారు .. తెరవనక ఎవరు సాయం చేస్తున్నారు .. తప్ప పైకి ఎవరూ మాట్లాడటం లేదు .. ఇప్పుడు డ్రగ్స్ కేసు కేదార్ చావు పొలిటికల్ టర్న్ తీసుకుంటే .  మళ్లీ వార్తల్లో హడావుడి మొదలవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: