అక్కినేని యువ ఆ సామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించింది.  తండేల్ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరూ తమ నటనతో మెప్పించారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈసినిమా.. విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటుంది. చైతూ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.ఈ సినిమాలో రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారని..ముఖ్యంగా ఎమోషనల్ సీన్లతో చైతూ ఏడిపించేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. వీరి మధ్య హృద్యమైన ప్రేమను ముడిపెడుతూ.. దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.

ఈ సినిమాకు సంగీతం మరో హైలెట్. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.అలాగే దేవీ శ్రీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తండేల్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. తాజాగా తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. మార్చి 7 న నెట్ ఫ్లిక్స్ లో తండేల్ ను డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలో అఫీషియల్ గా డేట్ ను ప్రకటించనుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో మెప్పించిన తండేల్ ఓటీటీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావాల్సి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే అంటే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఏదేమైనా ఓటీటీ ఆడియెన్స్ మాత్రం 'తండేల్' మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: