టాలీవుడ్ ,బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలా కీయారా అద్వానీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తున్న సమయంలో స్టార్ హీరోగా వెలుగుతున్న సిద్ధార్థ మల్హోత్రాన్ని ప్రేమించి మరి 2023 ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకున్నది.. ఆ తర్వాత ఎవరు సినిమాలతో వారు బిజీగా ఉన్నప్పటికీ.. అభిమానులు మాత్రం గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. తాజాగా కియారా అద్వానీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని తెలియజేసింది.


ఈ విషయం విన్న అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే వివాహమైన రెండు సంవత్సరాల తర్వాత ఈ జంట మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలియజేసింది. ఇక కియారా త్వరలోనే రణవీర్ సింగ్ తో కలిసి డాన్ 3 చిత్రంలో నటించాల్సి ఉంది. మరి ఈ సినిమా వదిలేసుకుంటుందా లేకపోతే ఏంటా అన్నది తెలియాల్సి ఉన్నది. కియారా భర్త సిద్ధార్థ కూడా ప్రస్తుతం పరమ్ సుందరి అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారట.


కియారా, సిద్ధార్థ ఇద్దరూ కూడా షేర్షా అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కాఫీ విత్ కరెంట్ షోలో తెలియజేశారు. ఫగ్లి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ తర్వాత ఎమ్మెస్ ధోని అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత రామ్ చరణ్ తో రెండు సినిమాలలో నటించింది కానీ ఈ సినిమాలేవి సక్సెస్ కాలేదు. మొత్తానికి కియారా, సిద్ధార్థ గుడ్ న్యూస్ చెప్పేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: