ప్రజెంట్ ఇండియన్ సినిమా టాలీవుడ్ వైపు దృష్టి పెడితే .. మన ప్రముఖ నిర్మాతలు మాత్రం ఇతర భాష సినిమాల పై ఫోకస్ పెట్టారు .. అందులో మైత్రి మూవీ మేకర్స్ మరింత జోరు ప్రదర్శిస్తుంది .. పుష్ప 2 ఘన విజయంతో గత ఏడాది భారీ విజయందుకున్న ఈ సంస్థ ఏకంగా డజనాకు పైగా సినిమాలను నిర్మిస్తుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ మహేష్ శ్రీమంతుడు సినిమాతో తెలుగు నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది .. అక్కడినుంచి ఎన్నో భారీ విజ‌యాలను తన ఖాతాలో వేసుకుంది .. ఈ బ్యానర్ నుంచి వస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్ మార్చ్ 28న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాను కూడా మైత్రి వారే నిర్మిస్తున్నారు .. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ .. అలాగే ఆ తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సినిమాని కూడా విరే నిర్మిస్తున్నారు ..


ఇక ప్రభాస్ హీరోగా హ‌నురాగపూడి డైరెక్షన్లో వస్తున్న పౌజి సినిమాను కూడా మైత్రి నిర్మిస్తుంది .. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియ‌ దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాను కూడా మైత్రి వారే నిర్మిస్తున్నారు .. అలాగే పవన్ కళ్యాణ్ హరి శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్స ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ,  రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ మూవీను తీసుకొస్తున్నారు మైత్రివారు.. అలాగే నాచురల్ స్టార్ నాని కోలీవుడ్ దర్శకుడుశిబి చక్రవర్తి తోనూ ఓ సినిమాను ప్లాన్ చేస్తుంది .. ఇప్పటికే చిరంజీవి దర్శకుడు బాబీ కాంబోలో వాల్తేరు వీర‌య్య‌ సినిమాను  నిర్మించి భారీ విజయందుకుంన్న‌రు   .. అలాగే బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి తో కూడా మైత్రి వారు భారీ విజయందుకున్న‌రు    ఈ సంస్థ మరోసారి ఈ సీనియర్ హీరోలతో మరోసారి ఈ కాంబోను రిపీట్ చేయబోతుంది . అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో జై హనుమాన్ సినిమా వస్తుంది .. అలానే రామ్ తో ఓ సినిమాని కూడా చేస్తుంది.


మైత్రి సంస్థ థింక్ బిగ్ అనే పాలిసీని గట్టిగా ఫాలో అవుతుంది .  అంచలంచెలుగా తన నిర్మాణ సామ్రాజ్యాన్ని దేశ మొత్తం విస్తరిస్తూ , డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగుపెట్టింది .  తెలుగుతో పాటు ఇతర భాష సినిమాలను కూడా రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది .. ఇప్పటికే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మైత్రి సంస్థ.. అజిత్ హీరోగా న‌టిస్తున్న‌  'గుడ్ బ్యాడ్ అగ్లీ'  సినిమాను ఏప్రిల్ 10 రిలీజ్ చేస్తుంది .. అదే రోజు ఈ సంస్థ సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలీవుడ్‌లో నిర్మించిన  జాట్ సినిమాని పాన్ ఇండియా స్థాయి  లో రిలీజ్ చేస్తుంది . అలాగే మలయాళం లో టొవినో థామస్ హీరోగా నడిగర్ తిలకం మూవీని నిర్మిస్తుంది మైత్రి సంస్థ .. అలాగే లవ్ టుడే ఫ్రేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో ఓ సినిమాను కూడా నిర్మించబోతున్నట్టు చర్చలు జరుగుతున్నాయి .. ఇలా రాబోయే రెండు మూడేళ్లలో మైత్రి మూవీ మేకర్స్   నుంచి దాదాపు 15 సినిమాలకు పైగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: