
ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు మరొకరు అటెండ్ కావడం , ఒకరి పర్సనల్ ఈవెంట్లలో మరొకరు సందడి చేయడం చూస్తూనే ఉన్నాం . ఇక అక్కినేని కింగ్ నాగార్జున .. తన సినీ కెరీర్లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాల్లో మెరిసాడు . కృష్ణ , హరికృష్ణ , శ్రీకాంత్ లాంటి హీరోలతో నాగార్జున మల్టీస్టారర్లు నటించి సక్సెస్ అందుకున్నాడు . అయితే.. చిరుతో మాత్రం .. ఆయన ఒక్క మల్టీ స్టారర్ సినిమా కూడా నటించలేదు . అయినా చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోకున్నా .. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై చిరంజీవి ని హీరోగా పెట్టి ఓ సినిమాను తీయాలని భావించాడు . వెంటనే .. కె.రాఘవేంద్రరావు ను అప్రోచ్ అయ్యాడు.
ఇక రాఘవేంద్ర చెప్పిన కథ చిరంజీవికి , నాగార్జునకు ఇద్దరికి నచ్చడం తో వెంటనే సెట్స్ పైకి వచ్చేసింది . అప్పట్లో సినిమాలో హీరోయిన్గా సౌందర్యని తీసుకున్నారు . ఇద్దరితో రెండు సాంగ్స్ కూడా పూర్తయ్యాయి . 10% టాకీ పార్ట్ కూడా ముగిసిన తర్వాత .. రాఘవేంద్రరావు ఎందుకో ఈ కథ చిరంజీవికి సెట్ అవ్వదు అని ఫీల్ వచ్చిందట. వెంటనే నాగార్జునను పిలిపించి సినిమా ఫ్లాప్ అవుతుంది .. చిరంజీవి కి అసలు సెట్ కాదని చెప్పేసాడట . దీంతో నాగార్జున సినిమాపై దర్శకుడుకే నమ్మకం లేకపోతే ఆపేయడమే మంచిదని చిరంజీవికి ఒపీనియన్ చెప్పాడు . వెంటనే చిరు కూడా దానికి అంగీకరించడం తో.. సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి ఇచ్చిన 30 రోజుల డేట్స్ కూడా వేస్ట్ అయిపోయినా.. చిరు, నాగార్జున పై కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదట.