ఈ మధ్య సోషల్ మీడియా ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. దీంతో సినిమా సెలబ్రిటీలకు పొలిటికల్ నేతలకు చాలా ఇబ్బందులు తలెత్తేలా చేస్తూ ఉన్నాయి.. వీరి గురించి పలు రకాల ఫేక్ న్యూస్ రూమర్స్ అంటూ పుట్టుకొచ్చేలా చేస్తూ ఉన్నాయి. వీటి వల్ల డైరెక్ట్ గా వారే స్పందిస్తూ ఊహ జనతాలకు చెక్ పెట్టే విధంగా మారే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఫేక్ న్యూస్ బారిన పడ్డట్టుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఆ ఫేక్ న్యూస్ ఏంటి?టీమ్ ఎందుకు క్లారిటీ ఇచ్చిందని విషయంపై ఇప్పుడు చూద్దాం.


మెగాస్టార్ చిరంజీవి ఫిలిం ఫేర్ నుంచి పద్మభూషణ్ దాకా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవికి యూకే ప్రభుత్వం అక్కడ పౌరసత్వాన్ని సైతం ఇచ్చినట్లుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపైనా చిరంజీవి టీమ్  స్పందిస్తూ.. చిరంజీవి గారు బ్రిటిష్ దేశపు గౌరవపారసత్వాన్ని సైతం అందుకుంటున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదంటూ టీమ్ కొట్టి పారేసింది. ఈ విషయాలను ఎవరు వైరల్ గా చేయొద్దంటు రిక్వెస్ట్ చేస్తోంది చిరంజీవి టీమ్


ఈ రూమర్స్ సంగతి పక్కన పెడితే యూకేలో చిరంజీవికి సన్మానించేందుకు సైతం ఒక ప్లాన్ చేశారని.. ఈ ప్లాన్ కి చిరంజీవి కూడా హాజరు కావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలె చిరంజీవి దుబాయ్ కి వెళ్లి మరి విశ్రాంతి తీసుకుని రావడం ఆ తర్వాత తిరిగి విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వంభర చిత్రం తర్వాత చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావు పూడితో తన తదుపరి చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో వీరు కాంబినేషన్ పైన కూడా మరింత ఆసక్తి పెరగడంతో అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: