నట సింహాం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి. తాజాగా వీరి కాంబోలో తన మరో సినిమా తెరకెక్కబోతుంది. అదే.. 'అఖండ 2-తాండవం'.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న 'అఖండ 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మూవీ మేకర్స్ నెట్టింట్టో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ మూవీ అప్డేట్ఏంటంటే అఖండ 2 తో బాలకృష్ణ ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు.అఖండ సినిమా నార్త్ ఆడియన్స్ కూడా ఇష్టపడ్డారు. అఖండ హిందీ డబ్బింగ్ కి మంచి వ్యూస్ వచ్చాయి. అందుకే అఖండ 2 ని డైరెక్ట్ గా రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఐతే అఖండ 2 తో బోయపాటి ప్లానింగ్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా లో బాలయ్య ఎలివేషన్స్, యాక్షన్ వేరే లెవెల్ అని తెలుస్తుంది. అంతేకాదు అఖండ 2 లో పార్ట్ 3 కి సంబందించిన అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తారని తెలుస్తుంది.

అఖండ 2 చివర్లో అఖండ 3 కి లీడ్ ఇస్తారట. అఖండ 2 లో కథ వేరే మలుపు తీసుకోగా పార్ట్ 2 పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతతో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య అఘోరా రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలావుండగా అఖండ 2 - తాండవం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా అఖండ 2' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం కూడా విడుదల కానున్నది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: