టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ అందాల భామ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మంచి మంచి సినిమాలలో నటిస్తూ తక్కువ సమయంలోనే గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె ఇటీవల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేసింది. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా మీనాక్షీ చౌదరి నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది.

ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీలో కూడా నటించి హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, వెంకటేష్ కి ప్రియురాలి పాత్రలో నటించి మంచి గుర్తింపును సాధించింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దుమ్ము లేపింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె ఓ పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. మీనాక్షి చౌదరి నటి మాత్రమే కాదు. ఈమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్,
 బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఫేమినా మిస్ ఇండియా విజేతగా కూడా నిలిచింది. 

అయితే ఏపీ ప్రభుత్వం మీనాక్షి చౌదరిని మహిళా సాధికారత విభాగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఈ ప్రచారం తప్పుడు ప్రచారమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. మీనాక్షి చౌదరికి ఎలాంటి పదవి కట్టబెట్టలేదని తెలిపింది. కొందరు సోషల్ మీడియా యూజర్స్ ఇలా తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఈ వార్తను రెడ్ టీవీ ఎంటర్ టైన్ మెంట్స్, తెలుగు స్క్రైబ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్ లు కూడా పోస్ట్ చేశాయని అన్నారు. ఇలా ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: