
ఈ సినిమా ఎప్పుడో మూడేళ్ల క్రితం ప్రారంభమైంది.. షూటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చింది.. దర్శకుడు క్రిష్ మధ్యలో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.. ఇప్పటికే అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అయింది.. కథ మారిపోయింది.. ఫైట్లు తీసేశారు.. పాటలు కూడా ఒకటి రెండు కోత పెట్టేశారు.. ఈ క్రమంలోనే ఎందుకో హరిహర వీరమల్లు సినిమా విషయంలో ట్రేడ్ వర్గాలలో భారీ స్థాయిలో అంచనాలు అయితే లేవు. పవన్ కళ్యాణ్ స్థాయిలో.. ఈ సినిమాకు బిజినెస్ జరగటం లేదు అన్నది వాస్తవం.
అందుకే నిర్మాత ఏం.రత్నం సైతం టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. నిర్మాత ఏం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ.. ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కెరీర్లో ఒక్క హిట్ కూడా లేదు. ఇవన్నీ ఈ సినిమా పట్ల క్రేజ్ తగ్గటం, బిజినెస్ తగ్గటానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కానీ.. స్టిల్స్ కానీ.. సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి పెంచలేకపోయాయి. హరిహర వీరమల్లు సినిమా కంటే సుజిత్ దర్శకత్వంలో పవన్ గ్యాంగ్ స్టార్గా నటిస్తున్న ఓజి సినిమా మీద ఎక్కువ క్రేజ్ ఉంది. ఓజి సినిమాకు భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది అన్నది వాస్తవం.