ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయిన హీరోయిన్ ల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఫిలిం వర్గాలలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నారు అన్న వార్తలు భారీ స్థాయిలో ట్రెండ్ అవుతూ వచ్చాయి. అయితే అదంతా నిజం కాదు ఫేక్ అంటూ తాజాగానే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది .


నిజానికి ఈ ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి అధిష్టానం ముందుగా ముగ్గురు హీరోయిన్స్ పేరులను ప్రతిపాదనకు తీసుకువచ్చిందట.  వాళ్లు మరెవరో కాదు యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ..సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.  ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటూ ఆలోచనలో పడ్డారట . అయితే ఈ వార్త కొంతమంది ద్వారా బయటకు వచ్చేసింది . అంతేకాదు చాలామంది ప్రముఖులు మీనాక్షి చౌదరినే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటూ ప్రస్తావన తీసుకొచ్చారట.



మరి ఎలా బయటపడిందో తెలియదు కానీ ఆ విషయం బయటకు వచ్చి సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి బాగా హైలెట్గా మారింది . అయితే తాజాగా ఇదంతా ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం . అయితే గవర్నమెంట్ చూస్ చేసుకున్న ముగ్గురు హీరోయిన్లు కూడా తెలుగు వాళ్ళు కాకపోవడం ఇక్కడ హైలెట్ అయిన విషయం.  మీనాక్షి చౌదరి నార్త్ లో ఉండే చౌదరి . ఇక సాయి పల్లవి తమిళ్ - మలయాళీ ప్రాంతాలకు చెందిన అమ్మాయి. నేషనల్ క్రష్  రష్మిక మందన్నా ఓ కన్నిడిగ. మరి ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరిని ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారు..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: