ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఎలా ఏకేస్తున్నారో జనాలు.. ఎలా ట్రోల్ చేస్తున్నారో.. ఎలా బూతులు తిడుతున్నారో... ఎలా వాళ్లకు సంబంధించిన నెగిటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారో  అందరం చూస్తూనే వస్తున్నాం. మరి ముఖ్యంగా గేమ్ చేంజర్  సినిమా ఫ్లాప్ అవ్వడం గేమ్ ఛేంజర్ పై మెగా ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉండడం.. ఆ సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో కలెక్షన్స్ పరంగా కూడా బాగా నెగిటివ్గా ఫీడ్ బ్యాక్ అందుకోవడం మైనస్ గా మారింది .


అంతేకాదు ఆ తర్వాత చిరంజీవి పలు ఈవెంట్స్ లో చీఫ్ గెస్ట్ గా మాట్లాడుతూ టంగ్ స్లిప్ అవ్వడం మరీ ముఖ్యంగా మెగా వారసుడిపై కామెంట్ చేయడం అదేవిధంగా.. ఆడపిల్లలను తక్కువగా చేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . అంతేకాదు తన తాత గారి గురించి చెబుతూ రసికుడు అన్న పదం యూస్ చేయడం చాలా చాలా చీప్ గా వల్గర్ గా ఉంది అంటూ అభిమానులు మండిపడ్డారు . అంతేకాదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు నేషనల్ లెవెల్ లో వైరల్ అవుతున్నాయి .



అయితే ఇలా రాంచరణ్ కి మరొక పక్క మెగాస్టార్ కి బ్యాక్ టు బ్యాక్ అన్ని ట్రోల్లింగ్స్ ఎదురుకోవడానికి కారణం గతంలో అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ చేసిన తప్పే అంటున్నారు జనాలు . అల్లు అర్జున్ ని ఏకాకి చేసి చాలా దారుణంగా ఆడుకున్నారు అని .. పైశాచిక ఆనందాన్ని పొందారు అని..ఆ కారణంగానే ఇప్పుడు ఈ విధంగా మెగా ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుందని మాట్లాడుతున్నారు.  అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా నేషనల్ లెవెల్ లో బకరా అవుతాడు అని ఎవరు ఊహించలేకపోయారు అని ..సరదాగా నవ్వుతూ  ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన నేషనల్ మీడియా స్థాయిలో పరువు తీసేలా చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి చిరంజీవి పేరు సోషల్ మీడియాలో కావాలనే కొందరు గబ్బు పట్టించారు అని క్లియర్ గా అర్ధమైపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: