
ఈ సినిమా మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాలోని బోల్డ్ యాంగిల్ ని కూడా సందీప్ రెడ్డి బయటపెట్టారు. ఈ సినిమాని ఎంత రియలిస్టిక్ గా చూపించారీ అందరికి తెలిసిందే. కాగా సందీప్ రెడ్డి వంగా ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ అంటూ మరొక సినిమాకి ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు . అయితే ఆయన పలు సందర్భాలలో ఓపెన్ గానే చిరంజీవితో సినిమా చేయాలని ఉంది అంటూ బయట పెట్టాడు .
ఇప్పుడు ఆ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . రీసెంట్ గానే ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు తెలుస్తుంది. అంతే కాదు వీళ్ళ కాంబోలో సినిమా కూడా సెట్ అయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే సందీప్ రెడ్డి వంగతో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట . ఈ సినిమా చేయడానికి ఎప్పటి నుండో చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగ . ఫైనల్లీ ఆ మూమెంట్ రావడంతో సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అర్జున్ రెడ్డి - అనిమల్ సినిమాలకి అమ్మ మొగుడి రేంజ్ లో ఈ మూవీ ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!