
దుష్యంత్ తన ఈశాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు .. అయితే సరైన ప్లానింగ్ లేకుండా తీసుకున్న అప్పులు చివరకు అతన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి తోసేసాయి .. అలాగే తన భార్య అభిరాతో కలిసి ధన భాగ్యం ఎంటర్ప్రైజెస్ సంస్థ నుంచి 3.74 కోట్లు అప్పుగా తీసుకున్నాడు . అయితే ఆ మొత్తం తక్షణమే తిరిగి కట్టాల్సి ఉండగా నెలకు 30% వడ్డీతో కూడిన చెల్లింపులు ఆగిపోయాయి . అలా అప్పు తీసుకున్న డబ్బుతో జగజాల కిల్లాడి అనే సినిమాను మొదలుపెట్టిన అది నిర్మాణ దశలోనే ఆగిపోయింది .. ఇక దాంతో అప్పు ఇచ్చిన సంస్థ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది .. ఆ కోర్టు విచారణలో దుష్యంత్ అప్పు తీసుకున్న సొమ్మును ఇతర ఖర్చులకు వినియోగించాడని ఒప్పుకున్నాడు .. అంతేకాకుండా తీసుకున్న అప్పు వివరాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడని ఆరోపణలు కూడా వచ్చాయి .
అయితే కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది .. అప్పు తిరిగి చెల్లించే వరకు శివాజీ గణేషన్ కుటుంబానికి చెందిన ఇంటిని జప్తు చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చింది .. దీంతో తమిళ సిని వర్గాల్లో ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ఒకప్పటి అగ్ర హీరో ఇంటికి తాళం వేసే పరిస్థితి రావటం అభిమానులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందే .. శివాజీ గణేషన్ తమిళ ఛత్ర పరిశ్రమలో గౌరవం పొందిన నటుడు .. ఆయన సంపాదించుకున్న ఆస్తిని మనవడు ఇలా అప్పులపాలు చేయడం అభిమానులకు షాక్ కలిగించే విషయం .