ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి.
అందులో సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ బ్యూటీ ప్రేరణ, తన భర్త శ్రీపాద్ తో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఇక దీంతో జంటల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. మొదటి నుండి ఇప్పటివరకు ఈ షోలో టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు. ఇక రెండోవ స్థానంలో కొనసాగిన ఆదిరెడ్డి, కవిత.. ప్రేరణ ఎంట్రీతో కాస్త వెనకడుగు వేశారు. దీంతో ప్రస్తుతం రెండోవ స్థానంలోకి ప్రేరణ, శ్రీపాద్ చెరిపోయారు. మూడోవ స్థానంలో ఆదిరెడ్డి, కవిత కొనసాగుతున్నారు. ఇక ఈ సీజన్ విన్నర్ ఏ జోడీ అవుతుందో చూడాలి మరి.
ఇదిలా ఉండగా.. స్టార్ మా ఛానెల్ లో అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. అయితే స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రస్తుతం టాప్ లో నిలవడం  విశేషం. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: